Pages

Thursday 26 July 2012

సర్పవరం శ్రీభావనారాయణ స్వామి దేవాలయం

సర్పవరం శ్రీభావనారాయణ స్వామి దేవాలయం:

మన కాకినాడలో, సర్పవరం జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైనదని చెప్పబడుతున్న ఒక దేవాలయం ఉంది! అదే సర్పవరం శ్రీభావనారాయణ స్వామి దేవాలయం. ఎత్తైన గాలిగోపురం, విశాలమైన ప్రాంగణం, పురాతనంగా కనిపించే మండపమూ, ప్రవేశద్వారాలూ, నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంబమూ… మనకి ఒక కొత్త అనుభూతి కలుగజేస్తాయి. గాలిగోపురానికి ఎదురుగా రోడ్డుకి అవతలివైపు నారదుడు స్నానం చేశాడని చెప్పబడే కొలను ఉంది.
గాలిగోపురం

ఈ ఊరికి సర్పవరం అనే పేరు ఎందుకు వచ్చింది?:

కశ్యప, కద్రువ దంపతులకు చాలామంది సర్పరూప సంతానం ఉంటారు. జనమేజయుడనే చక్రవర్తి చేస్తున్న సర్పయాగంలో వారందరూ ఆహుతి కాబోవుచున్న సమయంలో వారిలో అనంతుడనే సర్పము విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి ఆ ఆపదనుంచి రక్షించబడతాడు. అనంతుడు తపస్సు చేసిన ఆ చోటనే విష్ణుమూర్తిని మూల భావనారాయణ స్వామి గా ప్రతిష్ఠ చేశాడట. ఇది పురాణాలలో చెప్పిఉన్నందున, ఈ ప్రతిష్ఠని పురాణవ్యక్తమైన మూర్తి అంటారు. ఒక సర్పముచే ప్రతిష్ఠించబడిన మూర్తి గల క్షేత్రం కనుక ఈ ఊరిని సర్పవరం అని పిలుస్తారు.   
నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంబo 

 స్వామిని భావనారాయణ స్వామి అని ఎందుకు పిలుస్తారు?:

ఒకసారి నారద మహర్షి దేవతలసభలో 'విష్ణుమాయను తెలుసుకోవడం నిరంతర నారాయణ జపం చేసే తనకు సాధ్యమని ' అన్నాడట. తరువాత కొంతకాలానికి ఆయన భూలోక సంచారంచేస్తూ ఒక సుందరమైన సరస్సు చూసి, అక్కడ స్నానము చేయవలెనని తలచి, ఆసరస్సులో మునిగి తేలేసరికి విష్ణుమాయ వలన స్త్రీ రూపం పొదుతాడు.స్త్రీరూపంలో ఉన్న నారదుడిని నారదస్త్రీ అని వ్యవహరిస్తారు. 
శ్రీభావనారాయణ స్వామి
ఆమె పీఠికాపుర మహారాజుని వివాహమాడి 60 మంది సంతానాన్ని కంటుంది. వారి పేర్లే 60 తెలుగు సంవత్సరాల పేర్లని చెబుతారు.పొరుగు రాజ్యంతో జరిగిన యుద్దంలో నారదస్త్రీ యొక్క భర్తా, 60 మంది సంతానమూ మరణిస్తారు. అప్పుడు ఆమె ఆకలిబాధతో తనవారినిపోగొట్టుకొన్న దుఖా:న్ని కూడా మరచి అలమటిస్తుండగా ఒక బ్రాహ్మణుడు అక్కడ ఉన్న సరస్సులో ఆమె ఎడమచేయి తడవ కుండా స్నానం చెయ్యమని చెబుతాడు.  
నారదుడు స్నానం చేశాడని చెప్పబడే కొలను 
అతను చెప్పిన విధంగానే సరస్సులో స్నానం చేసి భయటకు వచ్చేసరికి ఆమెకి అసలు రూపం వస్తుంది కానీ ఎడమ చేతికి ఉన్న గాజులు అలానే మిగిలిపోతాయి. బ్రాహ్మణుడు ఎక్కడా కనిపించడు. నారద మహర్షి విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి వాటిని వదిలించుకొంటాడు. అప్పుడు నారద మహర్షి రాజ్యలక్ష్మీ సమేత శ్రీ భావన్నారాయణ స్వామిని ప్రతిష్ఠిస్తాడు. నారదుని గర్వమనే భవరోగాన్ని వదిలించిన స్వామి కనుక ఈయనను భావన్నారాయణ స్వామి అంటారు. ఋషిచే  ప్రతిష్ఠించబడినది కావున ఈ క్షేత్రాన్ని ఆౠషం అంటారు.             
పురాతనంగా కనిపించే మండపo 

ఇక్కడి విశేషం ఏమిటి?:

ఇక్కడ స్వయంభూగా వెలసిన పాతాళ భావనారాయణ స్వామికూడా ఉంది. ముగ్గురు మూర్తులున్న దీనిని త్రిలింగ క్షోణి వైకుంఠము అంటారు. శ్రీ కృష్ణదేవరాయల తండ్రి వసంతభోగరాయలు నిర్మించిన మండపం ఈ దేవాలయంలో ఉంది. ఈ విషయం ఇక్కడి శాశనాల వల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడంవల్ల 108 నారాయణ క్షేత్రాలు దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు.
పురాతనంగా కనిపించే మండపo 

విశేషంగా జరిగే కార్యక్రమాలు ఏమిటి?: 

మాఘమాసంలో నాలుగు ఆదివారాలూ తిరుణాళ్ళు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణం ఘనంగా జరుగుతుంది.
Visit this ancient temple and....
Have a happy darshan!

© Dantuluri Kishore Varma

14 comments:

  1. ఎంత బాగా పరిచయం చేసారండీ! ఏ రకమయిన కుజ, సర్ప దోషాలున్నా కేవలం ఒకే ఒక్కసారి ఈ స్వామి దర్శనం వలన దూరమవుతాయని జనుల నమ్మకం.

    ReplyDelete
  2. మీ అప్రీసియేషన్ కి చాలా థాంక్స్ రసజ్ఞగారు.మీ విలువైన సలహాలు అందిస్తారని ఆశిస్తూ...

    ReplyDelete
  3. dhanurmasam lo every sunday ANNADANAM chestaru

    ReplyDelete
  4. మీ ఇన్‌ఫర్‌మేషన్‌కి ధన్యవాదాలు రఘూగారు.

    ReplyDelete
  5. ధన్యవాదాలండి ఎందుకో ఏమో గారు.

    ReplyDelete
  6. Replies
    1. మీ అప్రీసియేషన్‌కి ధన్యవాదాలు.

      Delete
  7. I am living twenty five years in ramanayyapeta but we don't know the history
    Thanks u very much for sharing this history

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!