Pages

Friday 16 May 2014

ఎన్నికల ముచ్చట్లు

ఏప్రిల్ ఏడున ప్రారంభమైన వోటింగ్ ప్రక్రియ సుమారు నెలరోజుల పాటు కొనసాగింది. 
మనదేశంలో ఈ దఫా 814 మిలియన్ ప్రజలు,  
అంటే యూరోప్ ఖండపు జనాభా కంటే ఎక్కువమంది వోటు హక్కు కలిగిన వాళ్ళు ఉన్నారు.
18-19 సంవత్సరాల వయసున్న 23 మిలియన్ల యువత ఈ సారి వోటుహక్కును పొందారు. 
ఈ సంఖ్య మొత్తం వోటర్లలో మూడు శాతం. 
దేశవ్యాప్తంగా 9,30,000 వోటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 
పోటీ చేసిన అభ్యర్థులను అందరినీ తిరస్కరించే వోటు - 
నోటా(నన్ ఆఫ్ ద ఎబౌ) ని ఈసారి చేర్చారు.
వోటరు చూపుడు వేలిమీద వేసే గుర్తుకు వాడే ఇంకుని -
మైసూర్ ఇంక్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేసింది.
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు చాలా ఉత్కంఠ కలుగజేశాయి.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల దృష్టీ భారతదేశం మీదే  ఉంది. 
మే పదహారున అంటే ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు -
కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ప్రజలు టీవీలకి, 
లెక్కింపు కేంద్రాలకీ అతుక్కొని పోయారు. 
ఏనోట విన్నా ఎన్నికల మాటే!
కేంద్రంలో నరేంద్ర మోడీ నేత్రుత్వంలో బీజేపీ 
అత్యధిక మెజారిటీ సాధించి, ప్రభుత్వాన్నీ ఏర్పాటు చెయ్యబోతుంది. 
తెలంగాణా మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్,
ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు
ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు. 

పైన పేర్కొన్న కొన్ని విషయాలకు సోర్స్: డెక్కన్ క్రోనికల్   
Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!