Pages

Friday 26 September 2014

తెలుసా?

1. పర్వతరాజు మేరువుకి ఇద్దరు కుమారులు. ఇద్దరూ బంగారు`కొండలే`. పెద్దవాడు బద్రగిరి రాముడిని మెప్పించి తనమీదే నివాసం ఏర్పరచుకొనేలా చేశాడు. మీకు తెలుసు కదా, ఈ బద్రగిరి బద్రాచలంలోనిదని? ఇక మేరువుయొక్క రెండవ కొడుకు రత్నగిరి తనమీదకూడా ఒకదేవుడిని నిలుపుకొన్నడు - ఆ దేవుడు ఎవరో తెలుసా?

Image : From the Internet
2. గయాసురుడనే రాక్షసుడు విష్ణువు గురించి తపస్సు చేసి పవిత్రమైన దేహాన్ని పొందుతాడు. తరువాత కొన్ని సంఘటనల నేపద్యంలో త్రిమూర్తులు గయాసురుడి దేహాన్ని యజ్ఞపీఠంగా కావాలని కోరతారు. అప్పుడు గయాసురుడు తన శరీరాన్ని బీహార్లో గయ దగ్గర నుంచి ఒరిస్సా మీదుగా కాకినాడకు సమీపంవరకూ పెంచుతాడు. మనకు సమీపంలో ఉన్న ఆ ప్రాంతం ఏమిటో మీకు తెలుసా?

3. ఈ గుడిలో ప్రతీ సంవత్సరం చైత్ర, వైశాఖమాసాల్లో సూర్యకిరణాలు ఉదయం పూట భీమేశ్వరస్వామి పాదాలను, సాయంత్రంపూట బాలా త్రిపుర సుందరి అమ్మవారి పాదాలను తాకుతాయి. అది ఏ గుడో తెలుసా?

4. భీమేశాత్ ఉత్తమం దైవం న మహీతలే! అంటే భీమేశ్వరుని కంటే ఉత్తమమైన దైవం ఈ భూమిమీద లేదు అని. స్కాందపురాణంలోని గోదావరి ఖండంలో వ్యాసమహర్షి స్వయంగా చెప్పిన మాట ఇది. ఇంతకీ ఈ భీమేశ్వరుడు ఏ ఊరిలో ఉన్నట్టూ? 

5. రామాయణంలో అహల్య కథ తెలుసు కదా? ఇంద్రుడు చేసిన పనికి అహల్యని, ఇంద్రుడిని గౌతముడు శపిస్తాడు. అలాగే తారా చంద్రుల కథలో బృహస్పతి చందృడిని చాయను కోల్పోవలసిందని శపిస్తాడు. శాప విమోచనం కోసం ఇంద్రుడూ, చంద్రుడూ చెరొక శివలింగాన్నీ ఈ ఊరిలో ప్రతిష్టించారట. అది ఏ ఊరో తెలుసా? 

6. నారదకుండం అని పిలువబడే కొలను ఒకటి కాకినాడకి దగ్గరలో ఉంది. పురాణాల ప్రకారం నారదుడికి సంబంధించిన కథ ఒకటి ఆ కొలనుతో ముడిపడి ఉంది. దాని గురించి మీకు తెలుసా? 

ఓ సరదా క్విజ్. మీకు సమాదానాలు తెలిసే ఉంటాయి. తెలిస్తే కామెంటండి. లేకపోతే ప్రశ్నలకు చివర ఉన్న లింక్‌లు పట్టుకొని ఆయా టపాల్లోకి వెళ్ళి వివరాలు తెలుసుకోండి. 


© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!